స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో గుండెపోటు మరణం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో 13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. స్థానికుల వివరాల మేరకు.. అనంతారానికి చెందిన బాలిక శనివారం అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి బద్రాచలంలోగల మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రాగానే పరిశీలించిన వైద్యులు.. అప్పటికే బాలిక గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
గుండెపోటుతో 13 ఏళ్ళ బాలిక మృతి
0
384
Previous article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


