స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో గుండెపోటు మరణం కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో 13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. స్థానికుల వివరాల మేరకు.. అనంతారానికి చెందిన బాలిక శనివారం అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి బద్రాచలంలోగల మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రాగానే పరిశీలించిన వైద్యులు.. అప్పటికే బాలిక గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
గుండెపోటుతో 13 ఏళ్ళ బాలిక మృతి
0
383
Previous article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


