స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో నేటి నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం క్రతువుని నిర్వహిస్తున్నారు ఆలయ వేదపండితులు. ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ తరుపున నిర్వహించే ఈ యజ్ఞం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ యజ్ఞ స్థలికి చేరుకున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం నేటి నుంచి 17 వరకు జరుగనుంది. ముఖ్యమంత్రి రాక సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొననున్నారు.