స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,851 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,381 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. రేపు తిరుమల ఘాట్ రోడ్లలో స్వచ్చ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల ఆలయాల వీధులన్నీ శుద్ధం చేసేందుకు 37 కిలోమీటర్ల మేర స్వచ్చ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ పాల్గొననున్నారు.