ఫారో దీవుల్లో ప్రతి ఏడాది జరిగే సంప్రదాయ వేట గ్రిండాడ్రప్పై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సంప్రదాయ వార్షిక వేటలో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి. దీంతో సముద్ర జలాలు రక్తంతో ఎర్రగా మారాయి. పడవులు, బోట్ల సాయంతో డాల్ఫిన్లు, తిమింగలాలను తీర ప్రాంతానికి తీసుకొచ్చి హక్స్, కత్తులతో వాటిని హతమార్చారు. డాల్ఫిన్లు, తిమింగాలాలను చంపడానికి ఉపయోగించే స్పైనల్ లాన్స్ అనే ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండా కత్తులతోనే చంపడంతో అవి ఎక్కువ సేపు తీవ్ర రక్తస్రావంతో విలవిలలాడిపోయాయని సీ షెపర్డ్ ఆరోపించింది. ఈ తతంగం మొత్తాన్ని తీరంలో నిలబడి పెద్దలు, పిల్లలు వీక్షించారు.
ఫారో దీవుల్లో సంప్రదాయ వేటలో విలవిలలాడుతూ చనిపోయిన 700 తిమింగలాలు, డాల్ఫిన్లు
0
9
Previous article
Latest Articles
ప్రముఖ యూట్యూబర్ రమా నందన కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా...
- Advertisement -
- Advertisement -


