మార్చిలో ప్రపంచ సుందరీమణులు మనదేశంలో హల్ చల్ చేయనున్నారు. ప్రపంచ ఫ్యాషనిస్టులు, బ్యూటీ లవర్స్ 71వ మిస్ వరల్డ్ 2024కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే 115 దేశాలకు చెందిన కంటె స్టెంట్లు ఇండియాకు చేరుకోగా, ఈ ఏడాది కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.28 ఏళ్ల విరామం తర్వాత భారత్ లో ఈ పోటీలు జరుగుతుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ‘ఇండియా వెల్ కమ్ ది వరల్డ్ గాలా’ ప్రారంభోత్సవం జనవరి 20 న్యూఢిల్లీలోని హోటల్ అశోక్ లో జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న71వ మిస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది.ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత సినీ శెట్టి అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలు భారత గడ్డపై ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడం విశేషం. మిస్ వరల్డ్ ఎంపిక లో అందంతో పాటు టాలెంట్ తో కూడిన స్పీడ్ కాంపిటీషన్. దీనిలో పోటీదారులు జనరల్ నాలెడ్జ్ ,గానం, నృత్యం, కవిత్వం మొదలైన వాటిలో తమ నైపుణ్యాలను ప్రదర్శి స్తారు.
మనదేశానికి విచ్చేసిన ప్రపంచ సుందరీమణులు
0
439
Previous article
Next article
Latest Articles
బాల్క సుమన్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాల్క సుమన్ను నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. బాల్క సుమన్ వెంట అతని లాయర్ లక్ష్మణ్...
- Advertisement -
- Advertisement -


