జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో శ్రీలత, శోభన్రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉన్న తాము ఉద్యమాన్ని కొనసాగించినట్లు శ్రీలత తెలిపారు. తార్నాకలో ఫస్ట్ టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించింది తామేనని తెలిపారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులుగా కొనసాగిన తమకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తింపు లభిస్తుందని భావించామని చెప్పారు. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాము మేయర్ పదవీ అడిగితే, కేసీఆర్ డిప్యూటీ మేయర్ పదవీ కేటాయించారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త శోభన్రెడ్డికి ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరినా, కేటాయించలేదని ఆరోపించారు.