మార్చిలో ప్రపంచ సుందరీమణులు మనదేశంలో హల్ చల్ చేయనున్నారు. ప్రపంచ ఫ్యాషనిస్టులు, బ్యూటీ లవర్స్ 71వ మిస్ వరల్డ్ 2024కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే 115 దేశాలకు చెందిన కంటె స్టెంట్లు ఇండియాకు చేరుకోగా, ఈ ఏడాది కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాలి.28 ఏళ్ల విరామం తర్వాత భారత్ లో ఈ పోటీలు జరుగుతుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ‘ఇండియా వెల్ కమ్ ది వరల్డ్ గాలా’ ప్రారంభోత్సవం జనవరి 20 న్యూఢిల్లీలోని హోటల్ అశోక్ లో జరిగింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న71వ మిస్ వరల్డ్ గ్లోబల్ ఫినాలే మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది.ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత సినీ శెట్టి అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలు భారత గడ్డపై ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడం విశేషం. మిస్ వరల్డ్ ఎంపిక లో అందంతో పాటు టాలెంట్ తో కూడిన స్పీడ్ కాంపిటీషన్. దీనిలో పోటీదారులు జనరల్ నాలెడ్జ్ ,గానం, నృత్యం, కవిత్వం మొదలైన వాటిలో తమ నైపుణ్యాలను ప్రదర్శి స్తారు.
మనదేశానికి విచ్చేసిన ప్రపంచ సుందరీమణులు
0
457
Previous article
Next article
Latest Articles
అయోధ్య విరాళాల చోరీ కేసు… రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ టీమ్లో...
- Advertisement -
- Advertisement -


