రేపు విశాఖకు వైఎస్ జగన్… ప్రమాద బాధితులకు పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధితులను బుదవారం మాజీసీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరనున్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను కలిసి, వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీయనున్నారు. పారిశ్రామిక భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై, యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కార్మికులకు ప్రభుత్వం తరఫున భారీగా ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్