విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్.. కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..8 మంది కార్మికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రెగ్యులకః ఎంప్లాయిస్కు రూ.1.72 కోట్లు అందిస్తామని….కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.45.75 లక్షలు ఇస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం- పవన్ కళ్యాణ్
0
59
Previous article
Latest Articles
ఓబెరాయ్ హోటల్కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


