24.2 C
Hyderabad
Monday, September 25, 2023

ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ

Rajanna Sircilla |ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్‌లో జరిగింది. గంభీరావు పేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కుల లావణ్య, కిషన్ దంపతులకు ఇంతక ముందు ఒక సంతానం ఉన్నారు. 9 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాత లావణ్యకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని గైనకాలజీ విభాగాధిపతిరాలు డాక్టర్‌ అఖిల తెలిపారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని… ఇలా జరిగినప్పుడు తల్లీ, బిడ్డలకు క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయని అన్నారు. కానీ డాక్టర్ల సమిష్టి కృషి వల్ల డెలివరీ ప్రశాంతంగా జరిగిందని వివరించారు.

Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే: రేవంత్ రెడ్డి

Follow us on:  YoutubeInstagramGoogle News

 

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్