Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఛాన్స్ ఎవరికో..?

    టికెట్ దక్కేది ఎవరికో…? పోటీ చేసేది ఎవరో..? అధిష్ఠానం మదిలో ఏముందో..? సింగిల్ సీటు కోసం ముగ్గురు హేమాహేమీల యత్నం, మిత్రత్వంతో ఉన్న వారి మధ్య అకారణంగా ఏర్పడుతున్న అంతర్గత శతృత్వం, పైకి మాత్రం ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానాలు, జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్న నేతలు, ఈ పరిస్థితుల్లో అయోమయానికి గురవుతున్న పార్టీ క్యాడర్. ..ఇదంతా ఓ జాతీయ పార్టీలో రేపుతున్న పార్లమెంట్ టికెట్ అలజడి. ఇంతకీ ఆ పార్టీ ఏమిటి..? ఎంపీ స్థానానికి పోటీపడుతున్న ఆ నేతలు ఎవరు..?

     ఆ జాతీయ పార్టీలో పార్లమెంట్ టికెట్ చిచ్చు రేపుతోంది. ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ తనకే దక్కుతుందని ముగ్గురు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియని అయోమయంలో పార్టీ క్యాడర్ సతమతం అవుతోంది. ఎవరికిచ్చినా తాము పనిచేస్తామని ఈ నేతలు బయటకు చెబుతున్నా, జాతీయస్థాయిలో టికెట్ కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మరో రెండు మూడు రోజుల్లో టికెట్ పై ఉత్కంఠతకు ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టనున్నట్టు సమాచారం.

     పాలమూరు పార్లమెంటులో పరిధిలో బీజేపి పార్టీలో నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతుండగా… ఆ ముగ్గురిలో టిక్కెట్టు అవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటి కొనసాగుతుంది. దీంతో మహబూబ్‍నగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆ ముగ్గురు నేతలు ఎవరికి వారే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో పాలమూరు బీజెపి పార్టీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

    మహబూబ్‍ నగర్ పార్లమెంటు పరిధిలో మక్తల్‍, నారాయణపేట, కోడంగల్‍, దేవరకద్ర, మహబూబ్‍ నగర్‍, జడ్చర్ల, షాద్‍ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతి కుమార్ ఈ ఎంపీ సీటు కోసం పోటీపడుతున్నారు. ముగ్గురు నేతలు తమ ఫోటోలతో పోటా పోటీగా ఫ్లెక్సీల వార్ కు తెరలేపారు. టికెట్ ఎవరికి దక్కినా, అందరం కలిసికట్టు పనిచేస్తామని ముగ్గురు నేతలు పైకి చెబుతున్నారు. అయితే, అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు సాగిస్తు, టికెట్ వేట కోనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

    డికే అరుణకు గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధిష్టానం కల్పిం చింది. అప్పుడు, ఆమె పోటీ చెయ్యడానికి నిరాకరించారు. ఇదే ఇప్పుడు డికె అరుణకు ఇబ్బందులను తెచ్చిపెట్టాయన్న టాక్‍ కొనసాగుతుంది. గద్వాలలో ఓటమి చెందవచ్చని భావించిన ఆమె పోటీ చెయ్య లేదని తెలిసింది. అయితే, అక్కడ పోటీ చెయ్యకపోగా… తన మేనల్లుడు, అప్పటి బీఆర్‍ఎస్‍ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‍ రెడ్డి గెలుపునకు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలను డీకె అరుణ ఎదుర్కొన్నా రు. ఈ కారణం చేతనే మిగతా ఇద్దరు నేతలు డికె అరుణకు టిక్కెట్టు ఇవ్వరాదని అధిష్టానం ముందు గట్టిగా వాదిస్తున్నారని సమాచారం. అయితే, డికె అరుణ మాత్రం వీటన్నింటికి కొట్టి పారేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టిక్కెట్ కు పోటీ పడుతున్న ఏకైన మహిళను తానే కాబట్టే తనకే టిక్కెట్టు వస్తుందన్న ఆమె ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది.

      ముఖ్యంగా జాతీయ ఉపాధ్యాక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపి జితేందర్ రెడ్డిల మధ్య టిక్కెట్టు వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఢిల్లీ స్థాయిలో తమకున్న పరిచయాలతో పాలమూరు పార్లమెంటు టిక్కెట్టు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం. అయితుచ వీరికి ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ సైతం పాలమూరు టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. శాంతకుమార్ ఒకడుగు ముందుకు వేసి.. ప్రచారాన్ని సాగించేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురిలో టిక్కెట్ ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లాలోని కమలం పార్టీ కార్యకర్తలు, నేతల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మాజీ ఎంపి జితేందర్ రెడ్డి తనయుడు మిథున్‍ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‍నగర్ నుంచి పోటి చేశారు. ఈ కారణంగా జితెందర్ రెడ్డికి టిక్కెట్టు దక్కదన్న ప్రచారం పాలమూరులో జోరుగా సాగుతుంది. అయినా, పాలమూరు పార్లమెంటు సీటుకు పోటీ చెయ్యడమే తన ఆశయం అన్నవిధంగా జితెందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో టిక్కెట్టు వేట కొనసాగిస్తున్నారు.

ఇటీవల జరిగిన బిజెపి విజయసంకల్ప యాత్రలో ఈ ముగ్గురు నేతలు తలోదారిలో కనిపించారు. కిషన్ రెడ్డి యాత్రలో భాగంగా ముగ్గురు నేతలు సైతం గ్రూప్ రాజకీయాలు నడిపారని ప్రచారం బిజెపిలో కొనసా గింది. ఈసారి కచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని డీకే అరుణ తన రాజకీయ చతురతను జాతీయ స్థాయి లో చూపెడుతుండగా.. జితేందర్ రెడ్డి సైతం తనకున్న పాత పలుకుబడిని టికెట్ తెచ్చుకునే విధంగా పావులు కలుపుతున్నారని తెలిసింది. వీరిద్దరికీ ధీటుగా రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ సైతం తనకే టికెట్ వస్తుందని నమ్మకపై ముందుకు సాగుతున్నారని సమాచారం. మరి భవిష్యత్ లో ఈ పార్లమెంటు టికెట్ ఎవరిని వరించనుందో వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు .

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్