స్వతంత్ర, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రధాలను జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శిలకం మధుసూదనరెడ్డి ప్రారంభించారు. అన్నవరం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలో జనసేనని వారాహి యాత్రను నిర్వహిస్తారు. అనంతరం 14వ తేదీన కత్తిపూడిలో జరుగు బహిరంగ సభ జరుగనుంది. ఈ సందర్భంగా యాత్రను విజయవంతం చేయాలని పది ప్రచార రథాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ జనసైనికులు ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 ప్రచార రధాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రథాలు ప్రారంభం
0
496
Previous article
Latest Articles
సడెన్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ఎందుకు మెటా ఛార్జ్ చేస్తోంది?
ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...
- Advertisement -
- Advertisement -


