స్వతంత్ర, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రధాలను జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శిలకం మధుసూదనరెడ్డి ప్రారంభించారు. అన్నవరం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలో జనసేనని వారాహి యాత్రను నిర్వహిస్తారు. అనంతరం 14వ తేదీన కత్తిపూడిలో జరుగు బహిరంగ సభ జరుగనుంది. ఈ సందర్భంగా యాత్రను విజయవంతం చేయాలని పది ప్రచార రథాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ జనసైనికులు ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 10 ప్రచార రధాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.