Minister KTR: కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే

స్వతంత్ర వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి( Ponguleti Srinivasa Reddy) ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌(Thellam Venkatarao) ఈరోజు బీఆర్ఎస్లో(BRS) చేరారు. మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్‌.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

తెల్లం వెంకట్రావు చేరికతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు కాంగ్రెస్ చేశారు. పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావ్  భవిష్యత్ కు మాది భరోసా అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను(Congress) నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అని విమర్శించారు. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరు గమనించాలని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్