స్వతంత్ర వెబ్ డెస్క్: కామారెడ్డి(Kamareddy) జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి శివారు దేవునుపల్లి(Devunupalli) దగ్గర మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను(Convoy) అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు(Congress leaders) యత్నించారు . కామారెడ్డికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ ను అడ్డుగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనాల్లో తరలించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నిరసనలతో కేటీఆర్(Minister KTR) టూర్లో టెన్షన్ వాతావరణం కనిపించింది. మరోవైపు కామారెడ్డి మున్సిపాల్టీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్. 28 కోట్ల రూపాయలతో రోడ్లు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు.