29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

మోదీకి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddy |తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు మళ్లీ జారీ చేయడమే అందుకు నిదర్శనం. అరెస్ట్ చేస్తారనే ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) స్పందించారు. ఇది ప్రధాని మోదీ నిరంకుశ, దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయడమంటే…మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడినట్టేనని అన్నారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతోందనే సంగతి ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేయాలనే ధోరణితోనే మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు జైళ్లు, కేసులు కొత్త కావని తెలిపారు. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల్లో తేలుస్తామని, ప్రజల మధ్యకే వెళతామని పేర్కొన్నారు.

Read Also: కవిత ఇంటివద్ద టెన్షన్ టెన్షన్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్