29.4 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండా – విజయశాంతి

ఇటీవల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన విభజన సమస్యల పరిష్కాల భేటీని ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు విజయశాంతి ట్వీట్‌ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

తెలంగాణాలో మళ్లీ టీడీపీ విస్తరిస్తుందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ బలపడుతుందని ఆయన అనడం పలు అనుమానాలకు తావిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణాలో టీడీపీ ఎప్పటికీ బలపడదన్నారు. తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి బలపడడానికి కుట్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీని కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్