నీట్ రీ ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్పై బ్యాన్ విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నీట్ రీ ఎగ్జామినేషన్కు సంబంధించిన మోసాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( NTA) స్వాగతించింది. ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సంస్థ చేసిన సిఫార్సుల మేరకు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాక్సెస్పై తాత్కాలిక నిషేధం విధించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను నిలిపివేయాలని కూడా కేంద్రం ఆదేశించింది.
నీట్ రీ ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం…టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
Latest Articles
- Advertisement -


