తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


