25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏమైంది?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. రెండు సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్దిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంకు ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయస్థానంలో నిలిచిన బీఆర్ఎస్‌ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టుసాధించాలనుకుంటోంది బీఆర్‌ఎస్‌ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువ వ్వాలనుకుంటోంది. మరి బీఆర్‌ఎస్‌ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తోంది? మళ్లీ తిరిగి ఎలా నిలబడాలను కుంటోంది?

  తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇరవై ఏళ్లల్లో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకు తో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకు నే మాటలు ఆయక రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమైందనే దానిపై చర్చ జరుగుతోంది. ఆరు నెలల క్రితం వరకు అధికార పార్టీ ఇప్పుటు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ 16.68 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఆరు నెలల్లోనే 17ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయింది బీఆర్ఎస్‌. బీఆర్‌ఎస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా కీలక నేతలంతా పార్టీని వీడడం క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం కాంగ్రెస్‌, బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు పక్క పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్‌కు బలమైన సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

  గులాబీ బాస్ కేసీఆర్‌కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్‌ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

   కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణ యాలు తారుమారయ్యాయనే చర్య జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడం లో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.అంతకు ముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజికవర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికై నా బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చనడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్