మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్ విధించింది. దీనితో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, నిజామాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా మోహన్ నాయక్ నివాసం, కార్యాలయాల నుండి సుమారు 65 లక్షల నగదు, 1.5 కేజీల బరువు గల 15 బంగారు బిస్కెట్లు, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 200 కోట్లకు పైనే ఉంది.

Latest Articles

మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్