శివసేన పార్టీ తెలంగాణలోనే కాకుండా మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ముఖ్య భూమిక పోషిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. మేడ్చల్లో శివసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలోనూ శివసేన పార్టీ ముందుండి పోరాడిందని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా శివసేన పార్టీ నుండి తనను బరిలో నిలపాలని అధిష్టానాన్ని కోరానని సుధాకర్ తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు దోచుకోవడం దాచుకోవడం కోసమే పనిచేశారని సుధాకర్ విమర్శించారు.