మాజీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్, చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి గ్రామ ఎర్రకాలువ పూడిక తియ్యక రైతులు ఇబ్బందులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. 42 ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జగన్ చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ తీరుతో జిల్లాలోని 40 వేల ఎకరాలు నీట మునిగిందన్నారు. రైతుల ఆగ్రహంతోనే వైసీపీ ఓడిపోయిందని విమర్శించారు. రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు షర్మిల.