28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

రాంచరణ్ కు మరో అరుదైన గౌరవం.. చెర్రీని సన్మానించనున్న ప్రధాని మోదీ

RRR చిత్రంలో గ్లోబెల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రాంచరణ్(Ram Charan).. మరో ఘనత సాధించారు. ఇప్పటికే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు మూవీ యూనిట్ కు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్.. ప్రధాని మోదీతో స్టేజ్ షేర్ చేసుకోనున్నారు. ఈనెల 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్(India Today Conclave) లో చరణ్ పాల్గొనబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు మోదీ(Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్(Sachin) కూడా ఈ షోలో పాల్గొనున్నారు. ఈ షోలో చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. RRR సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం వంటి అనేక విషయాల గురించి చరణ్(Ram Charan) ఈ వేదికపై మాట్లాడనున్నారు. ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం తెలుగు ప్రజలందరుకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Read Also: ఆ నెలలోనే విశాఖ నుంచి పరిపాలన: జగన్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్