పవన్, చంద్రబాబు.. ఇద్దరూ స్టువర్ట్‌పురం దొంగలే.. మంత్రి అమర్ నాథ్ ఘాటు వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై(Pawan Kalyan) మంత్రి అమర్నాథ్(Minister Amarnath) మరోసారి ధ్వజమెత్తారు. విశాఖలో(Visakha) నిర్వహించిన మీడియా సమావేశంలో(Media Conference) ఆయన మాట్లాడుతూ.. పవన్ వారాహి యాత్రలో ముఖ్యమంత్రిపై విషం, విద్వేషం కనిపిస్తోందన్నారు. రుషికొండ వరకు వెళ్లిన పవన్‌కు పక్కనే గీతం సంస్థ చేసిన అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం, ప్రభుత్వ భూమినే కబ్జా చేయడం అనే విమర్శ అవగహన రాహిత్యానికి నిదర్శనమ్నారు.

యజమాని కోసం పవన్ కోతిలా గంతులు వేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు,(Chandrababu) వాళ్లకు సహకరిస్తున్న మీడియా.. అందరూ స్టువర్ట్‌పురం దొంగలని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. అటువంటి వాళ్ళు వాలెంటీర్లను దండు పాళ్యమని అవమానించడానికి నోరెలా వస్తోందని మండిపడ్డారు. పూర్తి అనుమతులతో రుషికొండ అభివృద్ధి జరుగుతుంటే.. వచ్చిన నష్టం, అభ్యంతరం ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

గట్టిగా ప్రశ్నిస్తే కేంద్రంతో చెప్పి ఆటాడిస్తానని పవన్ బెదిరిస్తున్నాడని.. కేంద్రంతో కాకపోతే పుతిన్‌తో చెప్పుకో అని మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. డాడీ, దత్తపుత్రుడు విడతల వారీగా విశాఖకు వచ్చి అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15కు పవన్ మంగళగిరి వెళితే.. చంద్రబాబు విశాఖ వస్తున్నారన్నారు. ఇద్దరు వేర్వేరుగా తిరగడం ఎందుకు.. కలిసి మెలిసి పర్యటించడం మంచిదని హితవు పలికారు.

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్