స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్(AP CM Jagan) ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేపు ప్రభుత్వం మారాక అన్నింటినీ బయటకు తీసుకొస్తామని, నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి, గుర్తుపెట్టుకో అంటూ ముఖ్యమంత్రి జగన్ కి పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
క్రిస్టియన్ సంఘాల భూమిని కబ్జా చేశారని చెప్పారు. స్థానిక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పైనా పవన్ ఫైర్ అయ్యారు. ”ఇక్కడి నుంచి పారిపోతానని ఎంపీ అనడం సిగ్గు చేటు అన్నారు. “ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే రాజీనామా చేయ్. తిరిగి ఎన్నికలు పెడతాం” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు.
ఇటీవల విశాఖ(Vishaka) ఎంపీ కుటుంబాన్ని బంధించి, హింసించడానికి కారణం ఈ సీబీసీఎన్ సీ స్థలాలే. భూముల కబ్జా విషయాన్ని క్రిస్టియన్ పోరాట సమితి మా దృష్టికి తెచ్చింది. 3వేల గజాల పైచిలుకు సోషల్ వెల్ఫేర్ స్థలం కబ్జాకు గురి కాకుండా చేశాం. 18వేల గజాల పైచిలుకు చర్చి స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ కబ్జాలను, అక్రమాలను బయటకు తెస్తాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.