బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన ఓ మోడల్ భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి 11 కిలోలకుపైగా నాణ్యత కలిగిన హైడ్రోపోనిక్ మారిజువానాను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన మహిళను హర్ష సన్నీగా గుర్తించారు. జూన్ 10-11 తేదీల మధ్య రాత్రి బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఇండియా విమానం టీజీ-351లో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో సాధారణ నిఘా తనిఖీల సందర్భంగా ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె వద్ద భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ రూ.11.82 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ.11.82 కోట్ల విలువైన గంజాయితో పట్టుబడిన మోడల్
0
18
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


