ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నా రు. ప్రత్యేక హోదా ఉద్యమం బుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ను నమ్ముకుని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని, ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని.. అవసరమైతే లాక్కోవాలని షర్మిల అన్నారు. మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు లేరు కాబట్టే తాను ఏపీ ప్రజల కోసం వచ్చానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించులోలేకపొతే ఏపీకి భవిష్యత్తు లేదంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ, పాలక, ప్రతిపక్షం మోసం చూస్తుంటే తనకే బాధగా ఉందని షర్మిల అన్నారు.