25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి – సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందన్నారు. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలని సూచించారు. ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో తాను కూడా నోట్ చేసుకుంటున్నానని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందన్నారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దని సీఎం సూచించారు. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని కోరారు. ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని అన్నారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్