ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయ న గత ప్రభుత్వం రబీ సీజన్ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోల వరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండల్ని అభివృద్ధి చేస్తానని, గతం లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్.