మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన నివాసం నుంచి సాగిన అంతిమ యాత్రలో మాజీ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, జావద్ అనిల్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న రాథోడ్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.