స్వతంత్ర టీవీ వార్తకు స్పందన వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయురాలు జానకిని సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ ఆర్డర్ కాపీని జానకికి ఎంఈఓ స్వరూప అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె లోని కొండపేట జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జానకి, కొందరు టీచర్లు వ్యక్తి గతంగా దూషించుకునేవారు. దాంతో పాటు విద్యార్థుల భవిష్యత్తునుగాలికి వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం స్వతంత్ర టీవీ వెలుగులోకి తీసుకొచ్చిం ది. జిల్లా అధికారులు చెప్పినా వారి పద్ధతి మారలేదు. దీంతో హెచ్ఎం జానకిని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు.