ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ జిల్లాలో ముంబై పిల్లల కిడ్నాప్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మగ పిల్లలే టార్గెట్గా ఓ ముఠా చేస్తున్న ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మగ పిల్లలను ఈ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో అమ్మేశారు. నలుగురు జగ్గయ్యపేటలో, ఒకరిని విస్సన్నపేటలో అమ్మేసినట్లు సమాచారం. ఈ ముఠాపై దృష్టి సారించిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఇద్దరు పిల్లలు దొరికారని.. మరో ముగ్గురు పిల్లల కోసం తనిఖీలు చేస్తున్నామని వారు తెలిపారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లా పాలెంలో మొత్తం 8 మంది పిల్లలను ఈ ముఠా కిడ్నాప్ చేసిందని.. పిల్లల అమ్మకంలో కీలక పాత్ర పోషించిన బెజవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం.. కీలక సూత్రధారి అరెస్ట్
0
437
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


