బిగ్ బ్రేకింగ్: ముందస్తుపై నేతలతో తేల్చి చెప్పేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. నిర్ణీత సమయం ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టంచేశారు. ప్రగతిభవన్ లో జరిగిన BRS విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీచేశారు. పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ సభలకు పోటీగా నియోజకవర్గాల వారిగా సభలు పెట్టండన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టండని నేతలకు వెల్లడించారు. సమావేశం ప్రారంభానికి ముందు దివంగత నేత సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేసీఆర్.

Read Also: ఆ రోజు వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్