Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

సీఎం ట్వీట్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్‌ చేసారు. ట్వీట్‌కు జతచేసిన వీడియోకు కాంగ్రెస్‌కు…కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ అంటూ కామెంట్‌ చేసారు. భువనగిరి ఎంపీ అభ్యర్ధి కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ వేళ జరిగిన కార్నర్‌ మీటింగ్‌ వీడియోను ఇందుకు జత చేసారు.

నామినేషన్‌

చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదనే దానికి ప్రజలే నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్తారని… టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కార్నర్‌ మీటింగ్‌

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం తాట్టేపల్లి గ్రామంలో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని… వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తాండూర్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

నామినేషన్ల హోరు

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యరావు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ముందు గొల్లపల్లి సూర్యరావు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మండపేట నుంచి కూటమి అభ్యర్ధి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.

గెలుపు ఖాయం

నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్ పత్రాలను అందజేశారు. జిల్లాలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ గెలవాలని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు. దేశంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

కలిసే ఉంటాం..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఉండిలో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. తాను మంతెన రామరాజు విడిపోతామని ఎంతోమంది అనుకున్నారని… తాము ఎప్పుడూ కలిసే ఉంటాం, కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గంలో మంతెన కృష్ణం రాజును గెలిపించుకుంటామని మంతెన రామరాజు తెలిపారు. 

ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్త వాతా వరణం నెలకొంది. పార్టీని ఎంతో నమ్ముకున్నానని ఆయినా మోసం చేసిందని సునీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మడకశిర ఎమ్మెల్యే రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వెనకడుగు వేయలేదన్నారు. లోకల్ అభ్యర్థిగా మడకశిర ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఉందని ధర్మమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ భూమి దినోత్సవం

సమస్త ప్రజలకు ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆవరణలో ప్రపంచ ధరణి దినోత్సవాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్‌తో పాటు పర్యావరణానికి హాని కలిగించే అనర్ధాలను నియంత్రించినప్పుడే భూమి బాగుంటుంద న్నారు. నాలుగు నెలల నుండి కలెక్టరేట్‌లో ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కూలీల అవస్థలు

ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని ఉపాధి హమీ కూలీలు సౌకర్యాల లేమితో నానా అవస్ధలు పడుతున్నారు. గత రెండేళ్ల నుండి వేతనాలు అందడంలేదని వాపోతున్నారు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందించాలని, ఎండతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రైతుల నిరసన

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోళ్లు చేపట్టాలంటూ డిమాండ్‌ చేసారు. అరుకాలం కష్టపడి పండించిన పంటల్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసారు.

అగ్నిప్రమాదం

తిరుమలలోని పాప వినాశనం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు టీటీడీ అటవీ, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు రెండు ఎకరాలు అడవి ప్రాంతం కాలినట్టు సిబ్బంది గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రాణహాని ఉంది..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ నేత హేమచంద్రారెడ్డి ఆరోపించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని తెలిపారు.

విద్యుత్‌ షాక్‌

శ్రీకాకుళం జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రణస్థలం మండలం అల్లివలస గ్రామంలో పెళ్లి జరుగుతున్న క్రమంలో 12మందికి విద్యుత్‌ షాక్‌ తగిలింది. అందులో సీతమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పెళ్లింట ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కారు కంటైనర్‌ క్రిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలను వెలికితీసేందుకు రెండు గంటలకు పైగా శ్రమించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌

హైదరాబాద్‌ బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తపేట గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్లాస్టిక్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకోవ డంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్