కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు పైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పొలంబాట పడితే తప్ప..పంటలకు నీళ్లు విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. అంతకు ముందే ఎందుకు నీళ్లు విడుదల చేయలేదని నిలదీశారు మాజీ మంత్రి. రైతుల్ని కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. నాలుగు నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇంకా వ్యవసాయ కూలీలకు 12వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని హెచ్చరిం చారు హరీశ్రావు.
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజా పూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ కాల్పుల్లో నలుగురు మావోయి స్టులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కోనసీమ జిల్లాలో చంద్రబాబు ఒకరోజు పర్యటన
ఒకరోజు పర్యటన కోసం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లా రానున్నారు. రేపు ఉదయం జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తారు. అక్కడ నాలుగు కిలోమీటర్లు రోడ్ షో నిర్వహిస్తారు. అనం తరం ద్రాక్షారామలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కొత్తపేట నియోజకవర్గం రావుల పాలెం వెళ్తారు. అక్కడ స్ధానిక నాయకులతో సమావేశం తర్వాత బహిరంగలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని ఆ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు
శ్రీకాకుళం నగర పరిధిలో తిలక్తో కలిసి ధర్మాన ప్రచారం
శ్రీకాకుళం నగర పరిధిలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ శ్రీకాకుళం లోక్సభ అభ్యర్థి పేరాడ తిలక్తో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈనేపథ్యంలోనే ఆయనకు ఓ అనుభవం ఎదురైంది. ప్రచారంలో ప్రజలను ఓటు ఎవరికి వేస్తారని అడిగితే..చాలా మంది హస్తం అని, సైకిల్ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రస్తుతం తరుణంలో ఇప్పటికీ చాలామందికి పార్టీ గుర్తు ఏంటో తెలియదని పేర్కొన్నారు.