చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ దాదాపు నాలుగు లక్షల 50వేల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే యువత విన్యాసాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు టుటౌన్ డీఎస్పీ రాజగోపాల్రెడ్డి. ఎవరైనా అక్రమంగా మద్యం గాని, గంజాయి గాని తరలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.