MLA Balineni | ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై స్పందించిన బాలినేని.. మైత్రీ సంస్థలో తనకు పెట్టుబడులున్నాయో? లేదో? పవన్ కల్యాణ్ దర్యాప్తు చేసుకోవచ్చనని అన్నారు. మైత్రీ మూవీస్ సినిమాల్లో తమకు పెట్టుబడులున్నాయన్న ఆరోపణలు సరికాదన్నారు. నాకు గాని, మా వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి గాని మైత్రీ మూవీస్ సినిమాల్లో రూపాయి పెట్టుబడి లేదన్నారు. ఒకవేళ ఎవరైన పెట్టుబడులు పెట్టినట్లు రుజువు చేస్తే మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తానని.. అంతేకాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్లో బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఆరోపణలు రుజువు చేస్తే… మా ఆస్తి రాసిస్తా: బాలినేని
0
338
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


