తాము ప్రొఫెషనల్ కమెడియన్స్ అని… వైసీపీ నేతలు పొలిటికల్ కమెడియన్స్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. జనసేన అధినేత పవన్కల్యాణ్కు మద్దతుగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పవన్కల్యాణ్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. పవన్పై అభిమానంతో తాను నెలరోజుల ముందు షూటింగ్లూ పూర్తి చేసుకుని ప్రచారంలో పాల్గొన్నట్టు వివరించారు. ఇక ప్రచారం అనంతరం ఆయన పిఠాపురం దత్త క్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు.