హైదరాబాద్: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్ వ్యాపారులు హద్దులు పెట్టుకున్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టిన హద్దులను తొలగించి., చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. చెరువు స్థలంలో వెలిసిన గుడిసెలను ఖాళీ చేయాలని గతంలోనే అదేశించింది హైడ్రా. ఇక అధికారుల ఆదేశాలతో ఇప్పటికే పలువురు గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఫెన్సింగ్ చేస్తున్న కారణంగా ఇప్పుడు మిగిలిన గుడిసె నివాసితులు ఖాళీ చేస్తున్నారు.
నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా
0
38
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


