ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం.. డమ్మీ బొమ్మతో ఇంట్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌

మోడల్‌, నటి ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. భోపాల్‌లోని ఘటన జరిగిన ఇంట్లో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు అధికారులు. ఇందులో భాగంగా ట్విషా శర్మ భర్త సమర్థ్‌ సింగ్‌, అత్త గిరిబాలా సింగ్‌ను భోపాల్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లనున్నారు. అక్కడ ట్విషా శర్మను ఉరివేసుకున్న స్థితి నుంచి ఎలా కిందికి దించారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. విచారణలో సమర్థ్ సింగ్ తానే ట్విషాను ఉరి నుంచి కిందికి దించానని, తన తల్లి గిరిబాలా సింగ్ ఆమె మెడకు ఉన్న ముడిని విప్పిందని సీబీఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ట్విషా మృతదేహం వేలాడుతూ కనిపించిన ఇంటి ప్రదేశానికే సమర్థ్, గిరిబాలాలను తీసుకెళ్లి మొత్తం ఘటనను రీక్రియేట్ చేయనున్నారు. ఈ వాదనల నిజానిజాలను నిర్ధారించేందుకు సీబీఐ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దాదాపు 80 కిలోల బరువున్న డమ్మీని ఉపయోగించి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. సమర్థ్ సింగ్‌ను ఆ డమ్మీని వేలాడుతున్న స్థితి నుంచి కిందికి దించేలా చేసి, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌, వాస్తవ పరిస్థితులకు సరిపోతుందా లేదా అనేది పరిశీలించనున్నారు. అలాగే గిరిబాలా సింగ్‌ను కూడా డమ్మీ మెడకు కట్టిన ముడిని విప్పి చూపించాలని అధికారులు కోరనున్నారు. దీని ద్వారా ఇద్దరూ చెప్పిన కథనం, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలతో సరిపోతాయా లేదా అనేది విశ్లేషించనున్నారు.

Latest Articles

నార్సింగిలో ముష్కి చెరువుకు ఫెన్సింగ్‌ వేస్తున్న హైడ్రా

హైదరాబాద్‌: రాజేంద్ర నగర్ పరిధి నార్సింగిలో ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్‌ చేపట్టింది. ముష్కిన్ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించింది. కబ్జా చేసిన స్థలంలో చదును చేసి రియల్‌ వ్యాపారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్