రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చెత్త సేకరణ పట్ల అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో కంపు కొడుతోందని, అనారోగ్యాలబారిన పడే ప్రమాద ముందని ఆందోళన చెందుతున్నారు. అసలే వానాకాలం కావడంతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. చెత్త సేకరణకు కావాల్సిన వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నాయని, కేవలం మరమ్మ త్తుల పేరుతో మామూళ్లు వసూలు చేస్తూ వాహనాలను షెడ్డుకే పరిమితం చేశారని విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలోని ప్రధాన విధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి గుట్టలను తలపి స్తుందని ఇకనైనా స్పందించి వెంటనే చెత్త సేకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహ రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పారిశుద్ద్య అధికారుల నిర్లక్ష్యంతో గుట్టలుగా చెత్త
0
224
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


