హరీష్ రావు డబ్బులతో సిద్ధిపేటను పాలిస్తున్నారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించా రు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్ పేరిట హరీష్ లక్ష కోట్లు దోచుకున్నాడన్నారు. హరీష్ రావు ఉద్యమకా రులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్కు అమ్ముకుంటుందని దుయ్యబట్టారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.