పెద్దపల్లి జిల్లా నాగపల్లిలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో మత్తు మందు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మూడు కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి, మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ రమేష్ తెలిపారు.
పల్లెల్లో గంజాయి కలకలం
0
241
Previous article
Next article
Latest Articles
కోవిడ్ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


