పెద్దపల్లి జిల్లా నాగపల్లిలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో మత్తు మందు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మూడు కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి, మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ రమేష్ తెలిపారు.
పల్లెల్లో గంజాయి కలకలం
0
257
Previous article
Next article
Latest Articles
తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా యుద్ధం
అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి....
- Advertisement -
- Advertisement -


