Badradri| శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈనెల 30 న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఏటా రాష్ట్రప్రభుత్వం భద్రాద్రి కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.