TSPSC పేపర్ లీక్ కేసులో తనపై ఆరోపణలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న రాజకీయ దురుద్దేశంతోనే సంజయ్, రేవంత్ పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. IPC 499, 500 నిబంధనల ప్రకారం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లోగా తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకుండా పరువునష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై కేటీఆర్ రూ.100కోట్ల పరువునష్టం దావా
0
355
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


