ఢిల్లీలోని స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో హోటల్లో పనిచేస్తున్న కుక్ కేశవ్నేగిని నిర్లక్ష్యం వల్లే మంటలు అంటుకున్నాయని దర్యాప్తులో తేలింది. కుక్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కిచెన్లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే పేలిపోయిందని.. వెంటనే హోటల్ మెయిన్ పవర్ను ఆఫ్ చేసి తనని తాను రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీసినట్టు ఘటన తర్వాత కుక్ మీడియాకు వెల్లడించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయక తలుపులు లాక్ అయిపోయాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. చాలా మంది లోపలే చిక్కుకుపోయారని తెలుస్తోంది. బాత్రూమ్ తలుపులు రాకపోవడంతో విదేశీ జంట మరణించారని పోలీసులు చెబుతున్నారు.
వంటమనిషి నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం
0
12
Latest Articles
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
- Advertisement -
- Advertisement -


