ఎగువన కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి వరద పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 14.2 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజీ నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు. రానున్న 24 గంటలు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరిలో నదీ స్నానాలు చేయొద్దని సూచించారు. అలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించకుండా వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి వరద ఉధృతి
0
158
Previous article
Next article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


