వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠా యించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతు లతో మాట్లాడారు. అయినా రైతులు శాంతించ కుండా గిట్టుబాటు ధర కల్పించాలని.. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ప్రస్తుతం మిర్చి కొను గోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా పాట ధర క్వింటాల్కు 20,800గా ప్రకటించి..కేవలం 14 వేల నుంచి 16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. వ్యాపా రులతో అదనపు కలెక్టర్, మార్కెట్ శాఖ అధికారులు కొద్దిసేపట్లో చర్చలు జరపనున్నారు.
ఖమ్మం మార్కెట్లో అన్నదాతల ఆందోళన
0
193
Previous article
Next article
Latest Articles
కోవిడ్ను మించిన వైరస్… లాక్డౌన్ తప్పదా?
మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -
- Advertisement -


